7, ఏప్రిల్ 2014, సోమవారం

జగదీశ్ చంద్ర బోస్ -- రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు, ఆధునిక భారతంలో ప్రథమ వైజ్ఞానికుడు అని చెప్పుకోదగ్గ ఓ అసమాన శాస్త్రవేత్త.

చిత్రం: జగదీశ్ చంద్ర బోస్


సర్ జగదీష్ చంద్ర బోస్, (నవంబర్ 30, 1858 – నవంబర్ 23, 1937) ప్రముఖ ఆధునిక భారతంలో ప్రథమ వైజ్ఞానికుడు అని చెప్పుకోదగ్గ ఓ అసమాన శాస్త్రవేత్త. ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు.ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.
ఆంగ్లేయుల సామ్రాజ్యంలోని బెంగాల్ ప్రావిన్సు లో జన్మించిన బోసు కలకత్తా లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నారు. తరువాత ఆయన వైద్య విద్య కోసం లండన్ వెళ్ళారు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనసాగించలేకపోయారు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరారు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించారు.
ఈయన వైర్లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించారు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది జగదీశ్ చంద్రబోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశ్యంతో బహిర్గతం చేశారు.
సర్ జగదీష్ చంద్ర బోస్ వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ ను ఉపయోగించి వివిధరకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించారు. తద్వారా జంతువుల మరియు వృక్ష కణజాలాలో సమాంతర ఆవిష్కరణలు చేశారు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినా ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆయన చనిపోయిన 70 సంవత్సరాల తరువాత కడా విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలను ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నాం.
బోస్ ఆవిష్కరణల గురించి మామూలుగా చెప్పుకునేటప్పుడు, మొక్కల్లోజీవం ఉందని కనుక్కున్నాడని చెప్తుంటారు. ఇది పూర్తిగా సరి కాదు. మొక్కల్లో జీవం ఉందంటే అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండరు. బోస్ కనుక్కున్నది అది కాదు. మొక్కల్లో కూడా జంతువులలో ఉండే నాడీ మండలం లాంటిది ఉందని, దానికీ ప్రేరణలకి ప్రతిస్పందించే గుణం ఉందని, జంతు నాడీమండల ప్రతిస్పందనలకి, మొక్కల్లో ఈ కొత్త “నాడీమండల” ప్రతిస్పందనలకి ఎన్నో ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయని, వందలాది, అత్యంత నిశితమైన ప్రయోగాల ద్వారా నిరూపించాడు. జంతువులలో అయినా, మనిషిలో అయినా అసలు నాడీమండలంలో వ్యవహారాలన్నీ విద్యుత్ సంబంధమైన చర్యలు అన్న విషయం పాశ్చాత్య లోకంలో కేవలం రెండు శతాబ్దాల క్రితమే (లూయుగీ గాల్వానీ కప్ప కండరం మీద చేసిన ప్రయోగాల ద్వారా) తెలిసింది. కాని మొక్కలలోనూ అలాంటి నాడీమండలం ఉంటుందని ఎందుకో పాశ్చాత్య మానసం అంత సులభంగా ఒప్పుకోలేకపోయింది. కాని మనుషుల్లోను, జంతువుల్లోను మాత్రమే కాక, మొక్కల్లోను, రాళ్లు రప్పల్లోను, ఏదో అనిర్వచనీయమైన దివ్యతత్వం సమానంగా ఆవరించి ఉంటుందని చాటి చెప్పే భారతీయ తత్వచింతనా సాంప్రదాయంలో పుట్టి పెరిగినవారికి అలాంటి సమైక్య దృష్టి పెద్ద కష్టం కాదు. ఒక జంతు కండరంలోను, మొక్కలోను, లోహంలోను ఒకే విధమైన ప్రతిస్పందన ఎలా ఉంటుందో తను కనుక్కున్న ఫలితాలని ఒక పాశ్చాత్య సదస్సులో బోస్ ప్రదర్శిస్తే, అక్కడి వారు అవాక్కయ్యారు. సర్ జగదీష్ చంద్ర బోస్, (నవంబర్ 30, 1858 – నవంబర్ 23, 1937) ఆధునిక భారతంలో ప్రథమ వైజ్ఞానికుడు అని చెప్పుకోదగ్గ ఓ అసమాన శాస్త్రవేత్త. ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు.ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.
ఆంగ్లేయుల సామ్రాజ్యంలోని బెంగాల్ ప్రావిన్సు లో జన్మించిన బోసు కలకత్తా లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నారు. తరువాత ఆయన వైద్య విద్య కోసం లండన్ వెళ్ళారు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనసాగించలేకపోయారు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరారు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించారు.
ఈయన వైర్లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించారు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది జగదీశ్ చంద్రబోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశ్యంతో బహిర్గతం చేశారు.
సర్ జగదీష్ చంద్ర బోస్ వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ ను ఉపయోగించి వివిధరకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించారు. తద్వారా జంతువుల మరియు వృక్ష కణజాలాలో సమాంతర ఆవిష్కరణలు చేశారు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినా ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆయన చనిపోయిన 70 సంవత్సరాల తరువాత కడా విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలను ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నాం.
బోస్ ఆవిష్కరణల గురించి మామూలుగా చెప్పుకునేటప్పుడు, మొక్కల్లోజీవం ఉందని కనుక్కున్నాడని చెప్తుంటారు. ఇది పూర్తిగా సరి కాదు. మొక్కల్లో జీవం ఉందంటే అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండరు. బోస్ కనుక్కున్నది అది కాదు. మొక్కల్లో కూడా జంతువులలో ఉండే నాడీ మండలం లాంటిది ఉందని, దానికీ ప్రేరణలకి ప్రతిస్పందించే గుణం ఉందని, జంతు నాడీమండల ప్రతిస్పందనలకి, మొక్కల్లో ఈ కొత్త “నాడీమండల” ప్రతిస్పందనలకి ఎన్నో ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయని, వందలాది, అత్యంత నిశితమైన ప్రయోగాల ద్వారా నిరూపించాడు. జంతువులలో అయినా, మనిషిలో అయినా అసలు నాడీమండలంలో వ్యవహారాలన్నీ విద్యుత్ సంబంధమైన చర్యలు అన్న విషయం పాశ్చాత్య లోకంలో కేవలం రెండు శతాబ్దాల క్రితమే (లూయుగీ గాల్వానీ కప్ప కండరం మీద చేసిన ప్రయోగాల ద్వారా) తెలిసింది. కాని మొక్కలలోనూ అలాంటి నాడీమండలం ఉంటుందని ఎందుకో పాశ్చాత్య మానసం అంత సులభంగా ఒప్పుకోలేకపోయింది. కాని మనుషుల్లోను, జంతువుల్లోను మాత్రమే కాక, మొక్కల్లోను, రాళ్లు రప్పల్లోను, ఏదో అనిర్వచనీయమైన దివ్యతత్వం సమానంగా ఆవరించి ఉంటుందని చాటి చెప్పే భారతీయ తత్వచింతనా సాంప్రదాయంలో పుట్టి పెరిగినవారికి అలాంటి సమైక్య దృష్టి పెద్ద కష్టం కాదు. ఒక జంతు కండరంలోను, మొక్కలోను, లోహంలోను ఒకే విధమైన ప్రతిస్పందన ఎలా ఉంటుందో తను కనుక్కున్న ఫలితాలని ఒక పాశ్చాత్య సదస్సులో బోస్ ప్రదర్శిస్తే, అక్కడి వారు అవాక్కయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి