
కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించా రు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండరామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగా రు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించా రు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యా రు.
నడింపల్లి నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదివాడు. తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించా రు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.
తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసా రు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టా రు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకా రు. ఇతడు మహాత్మాగాంధీ అనుచరులలో ఒకడు. బ్రిటీషు పరిపాలన నుండి స్వేచ్ఛ కోసం జరిగిన భారత పోరాటంలో యితడు పాల్గొన్నా రు. ఈ పోరాటంకు ఇతని ప్రముఖమైన సేవ ఏమనగా చీరాల-పేరాల పోరాటంలో యితడు పాల్గొన్నా రు. ఈ రెండు గ్రామాలను కలిపి ఒక పురపాలక సంఘంగా మార్చవలెనని నాటి బ్రిటీషు ప్రభుత్వం తలచింది. ఇందువల్ల ప్రజలపై పన్నుల భారం పెరుగుతుంది. అందువల్ల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఈ గ్రామాల వాళ్ళ ఆలోచనకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రభుత్వబలప్రయోగం చేయగా, గ్రామస్తులు వేరే ప్రదేశానికి వెళ్ళి తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకున్నారు. దీనిని రామనగరం అన్నారు. ఈ చీరాల - పేరాల పోరాటంకు సాయంగా గోపాలకృష్ణయ్య వాలంటీర్ల దళాన్ని " రామదండు" అనే పేరుతో ఏర్పరచాడు. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశా రు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించా రు.
తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపా రు. ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర, జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా.
గోపాలకృష్ణయ్య రామార్చనా నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు. 1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి