22, మార్చి 2014, శనివారం

యలమంచిలి వెంకటప్పయ్య

యలమంచిలి వెంకటప్పయ్య హేతువాది. 1898లో జన్మించారు. స్వాతంత్ర సమర యోధుడు. కాకినాడ లో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. చెరుకువాడ నరసింహం భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈయన్ని సమర్దించారు. మంత్రాలులేని వివాహాలు, కులాంతర వివాహాలు పట్టుబట్టి చేయించారు. 99 సంవత్సరాలు పరిపూర్ణ జీతాన్ని గడిపిన వెంకటప్పయ్య గారు వారి మరణాంతరం వారి శరీరాన్ని మెడికల్ కాలేజికి దానం చేసారు. వారి నేత్రాలు ఇద్దరు అందులకు చూపును ఇచ్చింది. మూడ నమ్మకాలను నిరసిస్తూ అనేక రచనలను చేసారు. వారు రాసిన 53 పుస్తకాలలో ముఖ్యమైనవి ...

1. వేదాలంటే ఇవేనా? 1984
2. పుష్కరాలు ఎవరి కోసం? 1980
3. తులసీ రామాయణమంటె ఇదేనా? 1987
4. పెళ్ళెందుకు 1977
5. శ్రాద్ధకర్మ ఎవరి కొరకు? 1976
6. మంగళసూత్రం పవిత్రమైందా? 1979
7. మతాలు ఎవరికొరకు? 1992
8. కులం ఏది ? -1970
9. బీద బ్రతుకు -1985

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి