మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
ఆంధ్ర
ప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర
గీతంగా అధికారికంగా స్వీకరించబడిన ఒక గేయం. ఈ
గీత రచయిత శంకరంబాడి
సుందరాచారి. టంగుటూరి
సూర్యకుమారి మధురంగా పాడిన ఈ పాటను,
తను ప్రైవేటుగా గ్రామఫోన్ రికార్డులో హెచ్.యం.వి.
సంస్థ ద్వారా విడుదల చేసిన తరువాతనే ఆ
గీతానికి గుర్తింపు లభించింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి