5, మార్చి 2014, బుధవారం

మాగంటి బాపినీడు





మాగంటి బాపినీడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అగ్రశ్రేణి నాయకురు. తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని "ఆంధ్ర సర్వస్వము" అన్న పేరుతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రచురించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన తొలితరం నాయకులలో ఒకరు. ఇతని భార్య మాగంటి అన్నపూర్ణాదేవి కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది. ఆమె మంచి రచయిత్రి, సమాజ సేవిక.

బాపినీడు 1895లో ఆగష్టు 14 చాటపర్రు గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. కె. వెంకటరత్నంరెడ్డి వంటి సంఘసంస్కర్తల ప్రభావం, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి రాజకీయ నాయకుల ప్రభావం అతనిపై బలంగా పడింది. ముందు చూపు కలిగిన అతని కుటుంబం కలకత్తాలో అతని విద్యాభ్యాసానికి ఏర్పాటు చేసింది. అక్కడ అనేక రచయితల పరిచయం లభించింది. తరచు శాంతినికేతన్ సందర్శించేవారు. తరువాత అతను "ఇండియన్ డిఫెన్సు కార్ప్స్"లో చేరారు. అలాంటి మిలిటరీ శిక్షణ పొందిన మొదటి ఆంధ్రుడు అతనే. కలకత్తాలో అనేక సాస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. బెంగాల్ ఆంధ్రా అసోసియేషన్కు కార్యదర్శిగా పని చేశారు. తరువాత అతను అన్నపూర్ణాదేవిని పెండ్లాడారు.

"మల్లాది సత్యలింగం ప్రతిభా విద్యార్ధి" గా అతను అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్ళారు. అక్కడ "న్యూయార్క్ స్టేట్ కాలేజి ఆఫ్ అగ్రికల్చర్"లో బి.ఎస్‌.సి చదివారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎస్‌.సి పూర్తి చేశారు. ప్రొఫెసర్ వెబర్ అనే పండ్ల నిపుణుని వద్ద పని చేశారు. కార్నెల్ విశ్వవిద్యాలయం స్కాలర్షిప్పు లభించింది. కార్నెల్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వ్యవసాయక సంఘం (International Agricultural Society of the Cornell University) కి అతను స్థాపకుడు మరియు మొదటి ప్రెసిడెంట్ కూడాను. కాలిఫోర్నియాలో హిందూస్తాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు.

తరువాత బాపినీడు భారత దేశం తిరిగివస్తూ మధ్యలో జపాన్ దేశాన్ని సందర్శించారు. 1923లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిసాన్ ఉద్యమం ప్రాంభించారు. "ఆంధ్ర రైతు సభ" మొట్టమొదటి కార్యదర్శిగా పని చేశారు. గోదావరి-కృష్ణా సెటిల్మెంట్ సెంట్రల్ కమిటీలో చురుకుగా పనిచేశారు. కిసాన్ ఉద్యమాలు నడిపినందుకు ఆరు నెలలు జైలు శిక్ష అననుభవించారు.

1926లో అతని భార్య మరణం అతనికి పెద్ద దెబ్బ. ఆమె అతని దీక్షాకార్యక్రమాలలో చేదోడుగా ఉన్న ప్రతిభాశాలిని. బాపినీడు ఆంధ్ర విశ్వవిద్యాలయం సిండికేట్ మెంబరుగాను, ఆంధ్ర హరిజన సేవక సంఘం కార్యదర్శిగాను కూడా పని చేశారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ..సి.సి. మెంబరుగా ఉన్నారు. 1937లో మద్రాసు మద్రాసు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పార్లమెంటరీ సెక్రటరీగా పని చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి